.కేంద్రానికి వివరించాలి
అమరావతి, మార్చి 13
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి వివరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై గవర్నర్ను రెండు మూడుసార్లు కలిసి ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ హరిచందన్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు. గవర్నర్ ఇప్పటికైనా స్పందించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి వివరించాలన్నారు.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని యనమల స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని పరిస్థితులను చూస్తున్నామన్నారు.వ్యవస్థలన్నీ చేతులెత్తేశాక ప్రజలే గుణపాఠం చెప్పాలని యనమల పేర్కొన్నారు.