నామినేషన్ వేసిన జ్యోతిరాధిత్య సింధియా
భోపాల్, మార్చి 13
భారతీయ జనతా పార్టీ నాయకులు జ్యోతిరాధిత్య సింధియా రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్కు సింధియా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం, బీజేపీ నాయకుడు శివరాజ్సింగ్ చౌహాన్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జ్యోతిరాధిత్య సింధియా ఈ నెల 11న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా సమక్షంలో కమలం గూటికి చేరిన విషయం విదితమే.