YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

హైకోర్టుకు రేవంత్.. లోక్‌సభలో దుమారం.. 

హైకోర్టుకు రేవంత్.. లోక్‌సభలో దుమారం.. 

హైకోర్టుకు రేవంత్.. లోక్‌సభలో దుమారం.. 
హైద్రాబాద్, మార్చి 13 
కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌పై డ్రోన్లు నడిపించి చిత్రీకరించిన వ్యవహారం పార్లమెంటులో చర్చకు వచ్చింది. ఈ నేరానికి పాల్పడినందుకు రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు శుక్రవారం లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. శంకర్‌పల్లి కానోజీగూడ వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాను వాడినందుకు ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎయిర్‌ క్రాఫ్ట్ చట్టం ప్రకారం రేవంత్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ నామా కేంద్ర విమానయాన శాఖ మంత్రిని డిమాండ్‌ చేశారు. డ్రోన్‌ కెమెరాలతో వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని, నిబంధనలు ఉల్లంఘించి, పోలీసుల కళ్లుగప్పి రేవంత్‌ రెడ్డి డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించారని నామా వివరించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యులు నామాను నిలువరించేందుకు ప్రయత్నించడంతో కాస్త గందరగోళం నెలకొంది.ఈ కేసులో బెయిల్ కోసం ఎంపీ రేవంత్‌ రెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను మియాపూర్‌ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి డ్రోన్‌ కెమెరా కేసులో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఆయన శుక్రవారం హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావాల్సి ఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని రేవంత్ మరో పిటిషన్‌‌లో కోరారు. రేవంత్ కోసం రంగంలోకి ప్రముఖ న్యాయవాది రేవంత్ రెడ్డి కేసును వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఆధ్వర్యంలో కొంతమంది లాయర్లు హైదరాబాద్‌కు వచ్చారు. వారంతా రేవంత్ తరపున కోర్టులో వాదించనున్నారు. సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన న్యాయశాఖా మంత్రిగా పనిచేశారు

Related Posts