YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అసద్ పై కేసు

అసద్ పై కేసు

అసద్ పై కేసు
హైద్రాబాద్, మార్చి 13
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నమోదు చేసినట్లుగా హైదరాబాద్ మొగల్‌పుర పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోకి ఓ సభలో అసద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవి ఓ వర్గం వారిని రెచ్చగొట్టేవిగా ఉన్నందునే ఈ కేసును నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఒవైసీతోపాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యేపైనా కేసు నమోదైంది.బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీపై చర్యలు తీసుకోవాలని దిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్, భారత్, పాకిస్థాన్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ సెక్షన్ 153, 153 (a) 117 295-a, 120b కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Related Posts