వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో సీఎం జగన్ నెంబర్ వన్: లోకేష్
అమరావతి, మార్చి 14
వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో సీఎం జగన్ నెంబర్ వన్లో ఉన్నారని టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. తండ్రి హయాంలో తప్పులు చేసి ఐఏఎస్లను జైలుకి పంపారని, ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి చివాట్లు పెట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినందుకు టీడీపీ కార్యకర్తని రిమాండ్కి పంపారన్నారు. పోలీస్ వ్యవస్థని నిస్సిగ్గుగా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే.. ఈ రాష్ట్రంలో చట్టం అమలు అవుతుందా అని కోర్టులు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని లోకేష్ వ్యాఖ్యానించారు.