రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధుల్లోకి ఐ జి కె. సత్యనారాయణ
అమరావతి, మార్చి 14,
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఐ జి స్థాయి పోలీసు అధికారిని నియమించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ శనివారం ఉదయం ఒక ప్రకటనలో తెలియచేసారు. స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా ఐ జి స్థాయి పోలీసు ఉన్నతాధికారి ని నియమించడం జరిగిందని తెలిపారు. ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐ జి) కె. సత్యనారాయణ పేరును డిజిపి గౌతమ్ సవాంగ్ సిఫార్సు చేసారు. శుక్రవారం రాత్రి ఐ జి కె. సత్యనారాయణ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రిపోర్ట్ చెసారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అందుబాటులో ఉండి క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు సమన్వయంతో రాష్ట్రంలో ని శాంతిభద్రతలను సమీక్షించడం జరుగుతుందని రమేష్ కుమార్ అన్నారు.