YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలకు రీ నోటీఫికేషన్ ఇవ్వాలి

ఎన్నికలకు రీ నోటీఫికేషన్ ఇవ్వాలి

ఎన్నికలకు రీ నోటీఫికేషన్ ఇవ్వాలి
విజయవాడ, మార్చి 14
తల్లి విజయమ్మ నామినేన్ అడ్డుకోని ఉంటే ఆ బాధ జగన్మోహన్ రెడ్డికి తెలిసేది. మహిళ హక్కులను కాల రాసిందీ  వైసీపీ ప్రభుత్వం. దిశ చట్టం ఎక్కడ పడుకుంది. రీ నోటీఫికేషన్ ఇవ్వాలని  టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ  అన్నారు. శనివారం ఆమే మీడియాతో మాట్లాడారు.  గత 9నెలలుగా మహిళలను ఉద్దరిస్తున్నాం..నవరత్నాల్లో మొత్తం పథకాలు రూపోందించి పంచిపెడుతున్నాం..మహిళ రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చామని ఊకదప్పుడు ఉపన్యాసాలు చేస్తోంది. మంత్రాయలం, పుంగనూరు, కర్నూలు, తిరుపతి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, అదోని మొదలకు అనేక చోట్ల మహిళలు నామినేషన్లు వేసే పరిస్థితి లేదని అన్నారు. • మహిళలు నామినేషన్ల వేయడానికి వస్తే స్వయంగా పోలీసులే అడ్డుకునే పరిస్థితి ఏర్పడింది.  తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను నామినేషన్ వేయకుండా పోలీసులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు.  గిరిజన మహిళ మైనార్టీ మహిళ లాగా నామినేషన్ల వేయడానికి వెళ్లిన కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదు.  అదోనిలో ఎస్సీ మహిళ నామినేషన్ వేస్తే ఆమెకు రక్షణ లేదని మీనాక్షి నాయుడు ఇంటిలో పెట్టితే అర్ధరాత్రి వచ్చి పంపించాలని బెదిరింపులకు దిగారు.  పుంగనూరులో మహిళలు నామినేషన్లు రవ్వికలో  దాచుకొని వెళ్లితే రవ్విక లోపల చేయి పెట్టి తీసే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తే  ప్రభుత్వం ఏ గుడ్డి గాడిద పళ్లు తోముతోందని అన్నారు. .  విజయమ్మఅనే మహిళ అవమానంతో అత్యాహత్యాయత్నం చేసుకుంది.   ఎలక్షన్ నిఘా యాప్ ఏమైంది?  ఎలక్షన్ కమీషనర్ చేయాల్సిన పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు.    నామినేషన్ల వేయడానికి వచ్చిన మహిళలపై ఇలా దాడులు చేస్తే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?  రాష్ట్ర వాప్తంగా ఎంపీటీసీలకు  166చోట్ల మహిళలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.  జడ్పీటీసీ నామినేషన్ల వేయకుండా 5చోట్ల అడ్డుకోవడం జరిగింది.  కడపలో సింహాద్రి చలం లో మహిళ నామినేషన్ వేయకుండా కిడ్నాప్ డ్రామా అడారు.  మున్సిపల్ వార్డులో 40 మంది మహిళలను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.  కార్పోరేషన్ నామినేష్లల్లో 14మంది మహిళలపై దాడులు జరిగాయి.  5కోట్ల జనాభాలో 50శాతం మహిళలకు వైసీపీ నాయకులు ఈ గతి పట్టించారంటే ఏమన్నాలి.  ఇదే రకంగా వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను నామినేషన్ వేయకుండా అడ్డుకునే ఉంటే ఆ బాధ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండేది.  దిశ చట్టం ఎక్కడ పడుకుందో లేపాలి.  రాజ్యాంగబద్దంగా మహిళలకు ఉన్న హక్కును కాల రాసే పరిస్తితి ఉంది.   ఆ హక్కులు కాపాడే వ్యక్తి చంద్రబాబునాయుడు అని ఆ రాష్ట్ర మహిళలకు అర్ధం అయింది.  నిజంగా మహిళ పట్ల చిత్తశుద్ధి ఉంటే నామినేషన్ల వేయడానికి రీ నోటిఫికేషన్ ఇవ్వాలి. అర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరెస్టు ఎక్కినట్లు ఫీల్ అవ్వుతున్నారు.  మద్యం షాపులు నడిపేది ప్రభుత్వం మరి మద్యం బయటకు ఎలా వచ్చాయి.  టీడీపీ నాయకులు నామినేషన్ల వేయకుండా మద్యం సీసాలను టీడీపీ నాయకుల ఇళ్లల్లో పెట్టి భయపెట్టుతున్నారు.  మా ప్రాణాలు పోయిన మేము ప్రజాస్వామ్యం కాపాడటం కోసం పోరాటం చేస్తామని  అన్నారు.  రీ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మహిళ ద్రోహులుగా వైసీపీ నాయకులు మిగిలిపోతారు.  మహిళలపై జరుగుతున్న దాడులకు డీజీపీ గారు సమాధానం చెప్పాలని ఆమె   అన్నారు. 

Related Posts