YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పరిటాల ఫ్యామిలీ గుడ్ బై. ?

పరిటాల ఫ్యామిలీ గుడ్ బై. ?

పరిటాల ఫ్యామిలీ గుడ్ బై. ?
అనంతపురం, మార్చి 16
స్థానిక సంస్థల ఎన్నికల వేళ వలసలు టీడీపీని కలవరపెడుతున్నాయి. కొద్దిరోజులుగా పార్టీలో ముఖ్యమైన, సీనియర్ నేతలు షాకిస్తున్నారు. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీలోకి  క్యూ కడుతున్నారు. ఎన్నో ఏళ్లగా పార్టీలో కొనసాగుతున్న నేతలు కూడా వెళ్లిపోవడంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ టైంలో పార్టీలో నుంచి బయటకు వెళతారో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే మరికొందరు టీడీపీకి గుడ్ బై చెబుతారని.. ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని వైఎస్సార్‌సీపీ నేతలే  చెబుతున్నారు.ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో కీలకమైన పరిటాల ఫ్యామిలీ కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పుబోతుందనే ప్రచారం జరుగుతోందట. పార్టీలో  విభేదాలతో రేపో,మాపో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయట. దీంతో పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ స్పందించారు. తమ కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.. టీడీపీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ  రు.‘తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తున్నాం..మా నాన్న పరిటాల రవీంద్ర  సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం  తెలుగుదేశంపార్టీని బలంగా నమ్మి ప్రజా అభివృద్ధి కాంక్షిస్తూ నిత్య ప్రజాసేవలో కొనసాగుతున్నాం. అలాంటి మా మీద కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన  దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం పసుపు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే కుసంస్కృతి మాకు లేదు.. తరాలు మారినా తరగని అభిమానం తో పసుపు జెండా కోసం పని చేస్తాం.. కార్యకర్తలకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండి’అంటూ ఘాటుగా స్పందించారు.

Related Posts