YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రౌడీ షీటర్లా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే

రౌడీ షీటర్లా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే

 

రౌడీ షీటర్లా ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే
కడప మార్చి 16
స్థానిక సంస్థల్లో  జమ్మలమడుగు కు చెందిన బీజేపీ అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ నేత ఆది నారాయణరెడ్డి అన్నారు. కడపజిల్లా జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం లో బీజేపీ అభ్యర్థులు అధికంగా పోటీ చేసిన ఏకైక నియోజకవర్గం జమ్మలమడుగు మాత్రమేనని చెప్పారు.బీజేపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని దిని ఫై  బీజేపీ అభ్యర్థులకు హాని జరిగితే కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు జరగడం లేదని అన్నారు. రాత్రి బీజేపీ అభ్యర్థిని కిడ్నాప్ చేయాలన్న వైసీపీ  ప్రయత్నాలను అడ్డుకోవడంతో  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైసీపీ వారి పై తాను దాడి చేశానని దుష్ప్రచారా న్ని ఖండించారు.తనకు ఏమైనా జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ల దే పూర్తి బాధ్యత అని అన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రౌడీ షీటర్ లా ప్రవర్తిస్తున్నాడని,  కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే రాజీనామా చేస్తామన్నారు.

Related Posts