YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇసుక ర్యాంపులపై దాడులు

ఇసుక ర్యాంపులపై దాడులు

ఇసుక ర్యాంపులపై దాడులు
కాకినాడ
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం ఇసుక ర్యాంపలో స్టేట్ జాయింట్ టాస్క ఫోర్స్ దాడులు నిర్వహించింది. అక్రమంగా ఇసుక తరలిస్తూ లోడింగ్ చేయబడిన 3 లారీలు,  లోడింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో 29 లారీలు, 3 ట్రాక్టర్లు, ఒక వాటర్ ట్యాంకు, ఒక 200 మిషన్ సీజ్ చేశారు. గోపాలపురం ర్యాంపు గత కొంతకాలంగా మూతపడింది. దీంతో కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా చేసుకుని రాత్రులు అక్రమంగా ఇసుకను తరలించుకుపోతూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. ఈ దందా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్   వినిత్ బ్రెజివాల్ అదేశాల తో  స్టేట్ జాయింట్ టాస్క్ ఫోర్స్ డి.ఎస్.పి కృష్ణకిషోర్ రెడ్డి గోపాలపురం ఇసుక  ర్యాంపులో   ఆదివారం ఆర్ధ రాత్రి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్ చేశారు. 

Related Posts