కరోనా కంటే పెద్ద వైరస్ చంద్రబాబు
తాడేపల్లి.
మార్చి 16
తన సామాజిక వర్గానికి చెందిన పార్టీ(టిడిపి) బాగుండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా నిర్ణయం తీసుకోవడం బాధాకరం. చంద్రబాబు తో చర్చించి ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కి అభ్యర్థులు నిలబెట్టేందుకు దిక్కు లేదు. అందుకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకున్నట్టు ఉంది. ఎన్నికల కమిషన్ కు విచక్షణాధికారం అంటూనే విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకున్నారని అయన ఆరోపించారు. కరోనా వైరస్ కోసం ఎన్నికలు వాయిదా వేసే ముందు రాష్ట్రంలో అధికారులను ఎవరినైనా సంప్రదించారా. అంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు కనీసం ఒక సమీక్ష సమావేశం అయినా పెట్టలేదే. రానున్న రోజులలో మరింత మంది విదేశాలనుంచి వచ్చే అవకాశం ఉంది. పలు దేశాలు అక్కడ ఉన్న మనవాళ్లను వారి స్వదేశాలకు పంపనున్నట్లు సమాచారం ఉంది. 45 రోజులు ఎన్నికల కోడ్ ఉందని అంటూ చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాల కు పాల్పడుతున్నారని అన్నారు. ఎన్నికల కమిషనర్ కుమార్తె గతంలో ఈడీబీ లో పని చేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా చెప్పాలి. అందుకోసం రాష్ట్ర అభివృద్ధి ని ఫణంగా పెడతారా. ఎన్నికలు ఆపేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఆయనకు ఎక్కడిది. ఫ్రాన్స్ లో 5500 కరోనా కేసులు, కరోనా కారణంగా127 మంది చనిపోతే కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి లేదు కదా. కరోనా కన్నా పెద్ద వైరస్ గా చంద్రబాబు తయారు అయ్యారు. ఎన్నికలు ఆపేయాలనే నీచమైన ఎత్తుగడ చంద్రబాబు వేశారు. ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు అభ్యర్దులను నిలబెట్టే పరిస్దితి లేదు.అలాంటివాళ్ళు కూడా మాట్లాడితే ఎలా అని మంత్రి ప్రశ్నించారు..