YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏఎస్ పేట మండల టిడిపి నాయకులు వైకాపా లో చేరిక

ఏఎస్ పేట మండల టిడిపి నాయకులు వైకాపా లో చేరిక

ఏఎస్ పేట మండల టిడిపి నాయకులు వైకాపా లో చేరిక
నెల్లూరు మార్చి,16
నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం, గుడిపాడు గ్రామపంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ సభ్యులు మరియు మండల మాజీ ఉపాధ్యక్షులు దేవరాల  హజరత్ అయ్యా నాయకత్వంలో సుమారు వందమందికి పైగా సోమవారం వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు మేకపాటి  చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న ప్రజా పాలనకు కట్టుబడి టిడిపి నుండి వైకాపాలోకి చేరడం జరిగింది అన్నారు. నూతన  చేరికల కార్యక్రమంలో గుడిపాడు సాగునీటి సంఘం చైర్మన్ పిన్ని బోయిన కొండయ్య. ఎస్సీ నాయకులు కప్పల నాగయ్య , పులిమేరు నాగేశ్వరరావు, చీర్ల మాలకొండయ్య,  టంగుటూరు హజర్త్తయ్య, కప్పల నాగయ్య, సిహెచ్ మాలకొండయ్య, గుడిపాడు మాజీ సర్పంచ్ నంది పోగు చిన్న కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts