YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆర్థిక ఎమర్జెన్సీని కోరుకుంటున్న ప్రతిపక్ష నేతలు

ఆర్థిక ఎమర్జెన్సీని కోరుకుంటున్న ప్రతిపక్ష నేతలు

ఆర్థిక ఎమర్జెన్సీని కోరుకుంటున్న ప్రతిపక్ష నేతలు
 కరోనా వైరస్ తో ఎన్నికలు వాయిదా వేయడం తగదు
 వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం
నెల్లూరు మార్చ్ 16
. ప్రస్తుత ఆర్థిక  మాసంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రతిపక్ష నేతలు కోరుకుంటూ, స్వార్ధ రాజకీయ కుట్రలతో, కరోనా వైరస్ నెపంతో ఎన్నికలు వాయిదా వేయడం సమంజసం కాదని నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంతపేట ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ కరోనా వైరస్ లను సృష్టించి , ఆర్థిక మాంద్యాన్ని సృష్టిస్తూ , ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభద్రతాభావం, ఆర్థిక తీవ్ర నష్టం కలిగిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్తో ఏకమై రాష్ట్రంలో ఎన్నికలను వాయిదా వేయడం తగదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 70 కేసులు నమోదు కాగా, కేవలం ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ కేసుగా నమోదు అయినట్లు అధికారిక సమాచారం ఉన్నప్పటికీ, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం తగదని తన ఆవేదన వ్యక్తపరిచారు . ఎన్నికల కమిషనర్ ను అడ్డం పెట్టుకొని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే దిశగా ప్రతిపక్ష నేతలు సమర్థించడం సమంజసం కాదన్నారు. కేవలం కొందరి ప్రయోజనాల కొరకు, రాష్ట్రంలోని సామాన్య ప్రజల అభ్యున్నతి ని అడ్డుకోవడం మానవత్వం కాదన్నారు. మార్చి నెల 31వ తేదీ రాత్రి 12 గంటల తర్వాత , అప్పటి వరకు మంజూరైన నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకునే అవకాశమే ఉండదని తెలియజేశారు. అత్యవసర ఈ పరిస్థితులలో నిధులను ఉపయోగించుకోవాలంటే ఎస్ డి ఆర్ నిధులను ఉపయోగించుకోవాల్సి దేనని , అది కూడా రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. మార్చి నెలాఖరు తర్వాత ప్రభుత్వ అందజేయు వివిధ పింఛన్లు మరియు ప్రజా సంక్షేమ పథకాలు కుంటు పడే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా జీతాలు తీసుకునే అవకాశం లేదన్నారు. ఇటువంటి క్లిష్టతరమైన మార్చి నెలలో ఆర్థిక మాంద్యాన్ని కలిగిస్తూ, కేవలం కరోనా వైరస్ నెపంతో ఎన్నికలను వాయిదా వేయడం వలన ప్రజా ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన తేదీన లోపేదలకు ఇళ్లు, ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు రేటు తగ్గించిన కంపెనీలు పీపీసీ బస్తా రూ.225కే, ఓపీసీ బస్తా రూ.235కే గడచిన ఐదేళ్లతో పోలిస్తే అతితక్కువ రేటుకు సిమెంటు ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సిమెంటు కంపెనీల నిర్ణయం సిమెంటు కంపెనీ యజమానులు, ప్రతినిధులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం  అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు,  పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లను తగ్గిస్తున్నట్టుగా సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. పొజొలానా పోర్టబుల్‌ సిమెంట్‌ (పీపీసీ) బస్తా ధరను రూ.225లుగా, ఆర్డినరీ పోర్ట్‌ సిమెంట్‌ ధరను రూ.235లుగా నిర్ణయించాయి. 2015–16 నుంచి 2019–2020 మధ్యకాలంలో ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో సిమెంటు ధరలు రూ. 380 వరకూ ఉన్నాయి.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో వివిధ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనులకోసం ఈ ఏడాది అవసరమైన సిమెంటు వివరాలను కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్‌ టన్నులు, పంచాయతీరాజ్‌ శాఖ 25లక్షల మెట్రిక్‌ టన్నులు, జలవనరుల శాఖ 16.57 లక్షల మెట్రిక్‌ టన్నులు, మున్సిపల్‌శాఖ 14.93 మెట్రిక్‌ టన్నులు... తదితర శాఖలు కలిపి మొత్తంగా 1,19,43,237 మెట్రిక్‌ టన్నుల అవసరాలు ఉంటాయని వివరాలు తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు అని, అలాగే పేదలందరికీ ఇళ్లనిర్మాణం రూపేణా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. సిమెంటు ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని, ఈ పట్టాలు తీసుకున్నవారితోపాటు సొంతంగా స్థలాలు, పట్టాలు ఉన్న పేదలకు పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కంపెనీ ప్రతినిధులకు తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంటు బ్యాగు ప్రత్యేకంగా వేరొక రంగులో ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్‌ ద్వారా ఈ సిమెంటు పంపిణీ అవుతుందని సీఎం స్పష్టంచేశారు. నాణ్యతా నిర్ధారణ అయ్యాకే చెల్లింపులు జరుగుతాయని సీఎం కంపెనీలకు తెలిపారు.  పేదలకు ఇళ్ల నిర్మాణం సహా, వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సిమెంటు కంపెనీ ప్రతినిధులు స్పష్టంచేశారు. అవసరాలమేరకు పంపిణీ అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి కంపెనీల తరఫునుంచి ఇద్దరు ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని సిమెంటు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో జువారి సిమెంట్, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ, శ్రీ చక్ర, ఇండియా, మై హోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్యా బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్‌ తదితర కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. వేంటనే  ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

Related Posts