ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
కర్నూలు, మార్చి 16
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు 120 వ జయంతి వేడుకలలో భాగంగా సోమవారం కర్నూలు నగరపాలక సంస్థ చిల్డ్రన్ పార్క్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టన్ షెట్టి, డిఆర్ఓ పుల్లయ్య, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు లు పూలమాలలు వేసి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు.