YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

మార్చి 25న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది ప‌ర్వ‌దినం

మార్చి 25న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది ప‌ర్వ‌దినం

మార్చి 25న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది ప‌ర్వ‌దినం
తిరుచానూరు   మార్చి 16
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 25వ తేదీన‌ ఉగాది ప‌ర్వ‌దినం ఘనంగా జ‌రుగ‌నుంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేప‌డ‌తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా ఉద‌యం, సాయంత్రం విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం, ఆర్జితసేవలైన కుంకుమార్చన, సహస్రదీపాలంకార సేవ, ఊంజ‌ల్‌ సేవల‌ను టిటిడి రద్దు చేసింది

Related Posts