YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో భస్మాసుర హస్తం 

ఏపీలో భస్మాసుర హస్తం 

ఏపీలో భస్మాసుర హస్తం 
విజయవాడ, మార్చి 16 
మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి రమేష్‌కుమార్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాతో పాటూ కీలక అంశాలపై చర్చించారు. అనంతర మాట్లాడిన జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైనవారని.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని.. టీడీపీ అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించ తగ్గ విషయమే అన్నారు.రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి.. పోలీసులు ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నారని.. తన నెత్తి మీద తానే చేయి పెట్టుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు వేశామని.. ఇక పోలింగ్ రోజు ఏజెంట్లు కూర్చున్నా.. పోలీసులు, వైఎస్సార్‌సీపీవాళ్లు కూర్చోనివ్వడం అనుమానమే అన్నారు. వాళ్లే ఓట్లు వేసుకుంటారేమోనని.. ఇది చాలా ప్రమాదంగా ఉందన్నారు.కారణం ఏంటో తెలియదు కానీ పోలీసులు భయపడుతున్నారని.. ప్రతి పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు. అందుకే రమేష్‌కుమార్‌ను కలిశానని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం దగ్గర డబ్బులు లేకపోతే తమ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి.. ఇస్తామన్నారు. ఇక కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవని జేసీ వ్యాఖ్యానించారు.

Related Posts