గడిచిన రెండేళ్లుగా వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలతో కకావికలమైన తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. ఈ వేసవి (ఏప్రిల్ నుంచి జూన్)లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతోపాటు.. ఒడిసాలో వాతావరణం అంత వేడిగా ఉండదని పేర్కొంది.ఈ వేసవిలో అడపాదడపా ఉరుములతో కూడిన వర్షాలు కురియడమే ఇందుకు కారణమని తెలిపింది.