YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా అనుమానితులపై స్టాంప్

కరోనా అనుమానితులపై స్టాంప్

కరోనా అనుమానితులపై స్టాంప్
ముంబై, మార్చి 17
ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. లక్షలాదిమంది అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక భారత్ విషయానికి వస్తే.. మహారాష్ట్రలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తొలి మరణం కూడా సంభవించింది. ఇటీవలే దుబాయ్ వెళ్లొచ్చిన ఆయన ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. వైరస్ వ్యాప్తి చెందుకుండా ముందస్తు జాగ్రత్తల్ని పాటిస్తోంది.అనుమానితుల సంఖ్య పెరుగుతండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో హోం క్వారంటైన్డ్‌ లో ఉంటున్న కరోనా అనుమానితుల చేతులపై స్టాంపులు వేస్తున్నారు. చతురస్రాకారంలో ఉన్న ఆ స్టాంప్‌ను ఎడమ చేతులకు వెనుక వైపు వేస్తారు. ఆ స్టాంప్‌లో ‘నేను ప్రజలను రక్షించేందుకు ఇంట్లోనే ఉంటానని చెప్పేందుకు గర్వపడుతున్నాను’అనే నినాద రాసి ఉంది. స్టాంప్ వేసిన వారు మార్చి 30 వరకు ఇళ్లలోనే ఉండాలిస్టాంప్ ఉన్నవాళ్లు ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు. వీరు 14 రోజులపాటూ ఇంట్లోనే ఉండేలా.. ఆ ఇంక్ చెరిగిపోకుండా ఇండెలిబుల్ ఇంక్ ఉపయోగిస్తున్నారు. ఒక వేళ స్టాంప్ ఉన్నవాళ్లు ఇళ్లలో నుంచి బయటకు వస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇండియాలో కరోనా కేసుల్లో 33 శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయట.. అందుకే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. స్కూళ్లు, కాలేజీలతో పాటూ మరికొన్ని సంస్థలు మూతపడ్డాయి.ఇప్పుడు భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 125 చేరగా.. మరణాల సంఖ్య మూడుకు పెరిగింది. ఇప్పటి వరకూ కర్ణాటకలో ఒకరు, ఢిల్లీ మరొకరు కరోనా కారణంగా చనిపోయిన సంగతి తెలిసిందే. వీరు ముగ్గురూ సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం. మిగతా దేశాల్లోనూ వృద్ధులే ఎక్కువగా కోవిడ్ కారణంగా ప్రాణాలు వదులుతున్న సంగతి తెలిసిందే.

Related Posts