YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా ఎఫెక్ట్: స్వీయ నిర్బంధంలో కేంద్ర మంత్రి..

కరోనా ఎఫెక్ట్: స్వీయ నిర్బంధంలో కేంద్ర మంత్రి..

కరోనా ఎఫెక్ట్: స్వీయ నిర్బంధంలో కేంద్ర మంత్రి..
న్యూఢిల్లీ, మార్చి 17 
సామాన్యుల నుంచి వీఐపీల వరకు అందరిపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. కోవిడ్ భయాందోళనల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికే జంకుతున్నారు. కాగా కరోనా ప్రభావంతో కేంద్ర మంత్రి మురళీధరన్ ఢిల్లీలోని తన ఇంట్లో స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లిపోయారు. తిరువనంతపురంలో ఇటీవల తాను కలిసిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా లేదని తేలింది.ఐసోలేషన్‌లో ఉన్న మురళీధరన్... పార్లమెంట్‌కు వెళ్లడం లేదు. బీజేపీ పార్లమెంటరీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన డాక్టర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనతో కలిసి పని చేసిన 76 మంది వారి ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉంచారు.భారత్‌లో మంగళవారం మధ్యాహ్నం వరకు 126 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కరోనాను అరికట్టడం కోసం అప్ఘానిస్థాన్, ఫిలిప్పిన్స్, మలేసియా నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై కేంద్రం తక్షణ నిషేధం అమలు చేసింది. అంతకు ముందే యూరోపియన్ యూనియన్, యూరోపియన్ ఫ్రీ టేడ్ అసోసియేషన్, టర్కీ, యూకే తదితర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. ఖతార్, యూఏఈ, ఒమన్, కువైట్ దేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది.

Related Posts