YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్తాన్ లో ఒక్క రోజే 158 కరోనా కేసులు

పాకిస్తాన్ లో ఒక్క రోజే 158 కరోనా కేసులు

 పాకిస్తాన్ లో ఒక్క రోజే 158 కరోనా కేసులు
లాహోర్, మార్చి 17
కరోనా కేసుల సంఖ్య పాకిస్థాన్‌లో ఒక్క రోజులోనే గణనీయంగా పెరిగింది. దీంతో పాక్‌‌లో కరోనా కేసుల సంఖ్య 189కి చేరింది. సింధు ప్రావిన్స్‌లోనే 146 మందికి కరోనా సోకడం గమనార్హం.మంగళవారం నాటికి భారత్‌లో 126 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా పాకిస్థాన్‌లో ఇదే సమయానికి 189 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 90కిపైగా కరోనా కేసులు నిర్ధారణ కావడంతో.. ఒక్కసారిగా పాక్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. పంజాబ్, సింధు, ఖైబర్ ఫఖ్తూ‌న్‌ఖ్వా ప్రావిన్సులలో కొత్త కేసులు నమోదయ్యాయి. సింధులోనే 146 మందికి కరోనా సోకింది. వీరిలో 119 మంది యాత్రికులు కావడం గమనార్హం. వీరిందర్నీ సుఖ్ఖూర్, కరాచీ, హైదరాబాద్‌ల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉండే తఫ్తాన్‌లో పాకిస్థానన్ వందలాది మందిని క్వారంటైన్లో ఉంచింది. వీరిలో చాలా మంది క్వారంటైన్ ముగిసిన తర్వాత తమ స్వస్థలాలకు రావడంతో ఒక్కసారిగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది ఇరాన్ నుంచి తిరిగొచ్చిన వారేనని అధికారులు తెలిపారు. చైనా, ఇటలీ తర్వాత కరోనా ప్రభావం ఇరాన్‌లోనే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.తఫ్తాన్ నుంచి ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్ వచ్చిన వారిలో 19 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇరాన్, అప్ఘానిస్థాన్‌ల వెంబడి సరిహద్దులను రెండు వారాలపాటు మూసివేస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని విద్యాసంస్థలకు మూడు వారాలపాటు సెలవులు ప్రకటించారు. చాలా హోటళ్లు కరోనా అనుమానితులకు క్వారంటైన్లుగా మారిపోయాయి

Related Posts