సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక లేఖ రాసారు. ఎన్నార్సీ, సిఎఎ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా తెలంగాణా తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో కూడా తీర్మానం చేయాలి. లౌకికవాదిగా చెప్పుకునే మీరు పార్లమెంట్ లో వైసిపి ఎంపీలచే సిఎఎకు అనుకూలంగా ఓటు వేయించారు. కేంద్రం నిర్ణయంతో ముస్లింలు, మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నారని అయన లేఖలో పేర్కోన్నారు. దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నార్సీ, సిఎఎ, ఎన్పీఆర్ లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అయన రాసారు.