YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జాతీయ పార్టీలతో చంద్రబాబు కలిసేదిలేదు

Highlights

  • పార్లమెంటులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కలుస్తారు
  • టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
జాతీయ పార్టీలతో చంద్రబాబు కలిసేదిలేదు

బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన ఏ ఒక్క నాయకుడితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  భేటీ కాబోరని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ఈ రెండు పార్టీలను మినహాయించి ఇతర అన్ని పార్టీల నేతలో బాబు సమావేశమవుతారని చెప్పారు. రాష్ట్ర హక్కులను సాధించుకునే క్రమంలో, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి ఢిల్లీకి వచ్చారని చెప్పారు. పార్లమెంటులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆయన కలుస్తారని చెప్పారు. ఈ సందర్భగా బీజేపీ, కాంగ్రెస్ లు ఏపీని ఏ విధంగా వంచించాయో చంద్రబాబు వివరించనున్నారని... రాష్ట్ర విభజన ఎలా జరిగింది, 2014 ఎన్నికల తర్వాత విభజన హామీలకు బీజేపీ ఎలా తూట్లు పొడిచిందో తెలియజేయనున్నారని వెల్లడించారు.

Related Posts