టీడీపీ నేతలపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం..!
విజయవాడ, మార్చి 18
టీడీపీ నేతలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచర్ల ఘటన విషయంలో పోలీసులు, జగన్ సర్కార్పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో తాజాగా పోలీసుల సంఘం స్పందించింది. మీపై కేసులు పెట్టడానికి వెనుకాడం. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమ, బుద్దా వెంకన్న అబద్ధాలు చెబుతున్నారు. దాడి సమాచారం రాగానే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ నేతలను కాపాడారని వారన్నారు. మా ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడాం. ప్రాణాలు కాపాడిన పోలీసులనే నిందించడం బాధ కలిగించింది. రిపోర్ట్ ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదని వారన్నారు.