YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తప్పుడు వార్తలు రాస్తే శంకరగిరిమాణ్యాలే  

Highlights

  • ప్రసార మాధ్యమాలకు తేగేసిచెప్పిన కేంద్రం 
తప్పుడు వార్తలు రాస్తే శంకరగిరిమాణ్యాలే  

' తప్పుడు వార్త' అనే దానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వకున్నా.. నిబంధనలు అతిక్రమించే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై చర్యలుంటాయని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ తేగేసిచెప్పింది. నిర్ధారణ లేకుండా తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టుల గుర్తింపును (అక్రిడిటేషన్) శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు విలేకర్ల గుర్తింపునకు సంబంధించి మార్గదర్శకాలను సవరించింది. ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి నిర్ణయం వెలువడేంతవరకు ఆ విలేకరి గుర్తింపును నిలిపివేస్తామని చెప్పింది. వినియోగదారులకు అభిప్రాయాలు చూపి తప్పుదోవ పట్టించకుండా నైతిక విలువలు పాటించాలని తెలిపింది.నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను పత్రికలకు సంబంధించినవయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) పరిశీలనకు, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినవయితే న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) పరిశీలనకు పంపిస్తామని తెలిపింది.ఫిర్యాదులపై ఈ సంస్థలు 15 రోజుల్లోగా నిర్ణయాన్ని చెప్తాయని అంది.
నిబంధనలు..
తప్పుడు వార్తలు  ప్రచురించిన/ప్రసారం చేసినట్లు రుజువైతే సంబంధిత విలేకరి గుర్తింపును తొలి ఉల్లంఘన కింద ఆరు నెలల పాటు రద్దు చేస్తారు. రెండోసారీ అదే పని చేస్తే సంవత్సరం పాటు రద్దు చేస్తారు. మూడోసారీ తప్పు చేస్తే శాశ్వతంగా గుర్తింపును రద్దు చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలియజేసింది. ఇదిలాఉండగా తప్పుడు వార్తలు ప్రచురిస్తే గరిష్ఠంగా ఆరేళ్ల కారాగార శిక్ష విధించడానికి వీలు కల్పించే నూతన చట్టాన్ని మలేసియా పార్లమెంటు దిగువసభ సోమవారం ఆమోదించింది. సుదీర్ఘమైన చర్చతర్వాత అధికార కూటమి దీనికి అనుకూలంగా ఓటువేసింది. ఈ చట్టం స్థానిక ప్రసార మాధ్యమాలతో పాటు విదేశీ మాధ్యమాలకూ వర్తిస్తుంది.

Related Posts