YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

 ఇద్దరు మహిళలు... నిర్విరామ పోరాటం

 ఇద్దరు మహిళలు... నిర్విరామ పోరాటం

 ఇద్దరు మహిళలు... నిర్విరామ పోరాటం
న్యూఢిల్లీ, మార్చి 20,
నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారకులైనవారిని ఉరికంబం ఎక్కించడంలో ఇద్దరు మహిళలు ఏడేళ్ల పోరాటం చేశారు. వీరిలో ఒకరు నిర్భయ తల్లి, కాగా మరొకరు నిర్భయ తరఫు లాయర్ సీమా సమృద్ధి. నిర్భయ కేసులో ఆమె తల్లిచేసిన పోరాటానికి లాయర్ సీమా అందజేసిన సహాయ సహకారాలు ఎనలేనివి. అంతేకాదు, ఆమెకు ఇదే తొలికేసు కావడం విశేషం. సివిల్ సర్వీసులకు సన్నద్ధమవుతోన్న సీమా.. సుప్రీంకోర్టులో న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేస్తోంది. అత్యంత చురుకైన విద్యార్ధిగా గుర్తింపు తెచ్చుకున్న సీమా.. నిర్భయ కేసును ఓ సవాల్‌గా తీసుకున్నారు. ముఖ్యంగా నిర్భయ కుటుంబం, తల్లితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని కొనసాగించి కేసులో విజయం సాధించారు.కేసు విచారణ సమయంలో ఎదురయ్యే న్యాయపరమైన అంశాలపై కూలంకుషంగా చర్చించి, దోషుల తరఫు లాయర్ వేసే ఎత్తులను చిత్తుచేస్తూ తార్కికంగా ముందుకెళ్లారు. శిక్ష నుంచి తప్పించుకోడానికి కింది కోర్టు నుంచి సుప్రీం వరకూ దోషులు చేసిన ప్రయత్నాలను భగ్నం చేస్తూ.. ప్రత్యర్ధి లాయర్‌కు చుక్కలు చూపించారు. తన వాదనలతో న్యాయమూర్తులను మెప్పించారు. దీంతో తొలిసారి నిర్భయ దోషులకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు 2013 సెప్టెంబరులో మరణదండన విధించింది.అయితే దోషులు ఈ తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టులను ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పును 2014 మార్చి 13న ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. దీంతో 2014 మార్చిలో నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది. అయితే, 2017 మేలో హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అనంతరం 2018 జులైలో సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది. తర్వాత దోషులు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేయగా, వాటిని రాష్ట్రపతి కొట్టివేశారు.పాటియాలా హౌస్ కోర్టు మూడుసార్లు డెత్ వారెంట్ జారీచేసినా ఉరి వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 20న దోషులు ఉరికంబం ఎక్కారు. తిహార్‌ జైలులో పలువురు జైలు అధికారులతోపాటు, జిల్లా మెజిస్ట్రేట్‌ సమక్షంలో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు. ఈ సమయంలో 17 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. నిర్భయ దోషుల ఉరితీతను వైద్యులు ధ్రువీకరించారు. నలుగురూ మరణించినట్లు వెల్లడించారు.

Related Posts