YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

నిర్భయ నిందితులకు మరణశిక్ష ఎనిమిదేళ్ల తర్వాత న్యాయం

నిర్భయ నిందితులకు మరణశిక్ష ఎనిమిదేళ్ల తర్వాత న్యాయం

నిర్భయ నిందితులకు మరణశిక్ష
ఎనిమిదేళ్ల తర్వాత న్యాయం
న్యూఢిల్లీ, మార్చి 20
నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్స అమలు అయ్యింది. ఉదయం 4 గంటలకు నలుగురు దోషులకు అల్పహారాం అందించారు. నిర్భయ నలుగురు దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్ష పూర్తయ్యింది. ఉరికంబం వద్ద 40 మంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దోషి వెంట 12 మంది సిబ్బంది ఉన్నారు. దోషులకు ఉరిశిక్షకు ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలు నెంబర్ 3లో నలుగురిని ఉరి తీశారు. అయితే ఉరిశిక్షకు ముందు వినయ్ శర్మ బోరున విలపించాడు. ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులకు ఉరి తీశారు తలారి పవన్. అయితే ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు దోషులు అనేక ప్రయత్నాలు చేశారు. వివిధ కోర్టుల్లో వివిధ రకాల పిటిషన్లు దాఖలు చేసి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనే విషయం మరోసారి రుజువైంది. నిర్భయ దోషులు నలుగురికి ఉరి ఖాయం అయ్యింది.ఢిల్లీ హైకోర్టులో నిర్భయ దోషుల పిటిషన్‌పై గురువారం అర్థరాత్రి వరకు వాడీవేడీ వాదనలు జరిగాయి. పిటిషనర్ సమర్పించిన పత్రాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. పిటిషన్‌లో అనెక్జర్, అఫిడవిట్, మెమోలు లేవని అసహనం వ్యక్తం చేసింది. ఐతే కరోనా వైరస్ ప్రభావంతో కోర్టులో జిరాక్స్ యంత్రాలు కూడా పనిచేయడం లేదని దోషుల తరపు న్యాయవాది తెలిపారు. అందుకే తేలేకపోయామని దోషుల లాయర్ ఏపీ సింగ్ చెప్పారు. ఇవాళ మీరు కోర్టులు తిరిగారని.. ఫొటో కాపీ మెషీన్లు లేవంటూ కహానీలు చెప్పొదని జడ్జి అన్నారు. దోషులకు న్యాయపరమైన అవకాశాలు ఇంకా ఉన్నాయని.. NHRCలో పిటిషన్ పెండింగ్‌లో ఉందని, అలాంటప్పుడు దోషులను ఎలా ఉరితీస్తారని ఏపీ సింగ్ కోర్టును ప్రశ్నించాడు.దీంతో మీ వాదనలు మాకు అర్ధం కావడం లేదని.. కేవలం లీగల్ పాయింట్స్ మాట్లాడితే చాలాని స్పష్టం చేసింది కోర్టు. సమయం గడిచిపోతోందని.. త్వరగా ముగించాలని ఒత్తిడి తెచ్చింది. మీ క్లయింట్‌లు దేవుడి దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమయిందని జడ్జి అన్నారు. ఇంపార్టెంట్ పాయింట్‌ను లేవనెత్తకపోతే మీకు ఈ సమయంలో సాయం చేయలేదని ఖరాకండిగా చెప్పేసింది కోర్టు. డెత్ వారెంట్‌ను రద్దు చేయాలన్న దోషుల తరఫు పిటిషన్‌ను గురువారం ఉదయం పాటియాలా కోర్టు కొట్టివేసింది. దీంతో దోషుల తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు.అయితే దీనిపై గురువారం రాత్రి 11.30ల వరకు విచారణ సాగింది. దీంతో హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.సౌత్ ఢిల్లీలో 2012 డిసెంబర్ 12న కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయను గ్యాంగ్ రేప్ చేశారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయ.. చివరికి ప్రాణం వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తం ఆరుగురు దోషులు కాగా.. ఒకడు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయమే గెలిచింది : ఆశా దేవి ఏడేళ్ల కిందట దేశ రాజధాని ఢిల్లీలో నిస్సహాయ మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, ఆమె మరణానికి కారణమైన నలుగురు దోషులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషులు చివరి క్షణం వరకు శతవిధాల ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో దోషులైన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లను తీహార్‌ జైలులో ఉరితీశారు. పలువురు జైలు అధికారులతోపాటు, జిల్లా మెజిస్ట్రేట్‌ సమక్షంలో ఇవాళ ఉదయం 5.30 గంటలకు తలారి పవన్‌ జల్లాద్‌ ఈ ప్రక్రియను పూర్తి చేశారు. దోషులను ఉరితీయడంతో తీహార్ జైలు వద్ద భారీగా జనం గుమిగూడారు. దీంతో జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు. దోషులకు ఉరిశిక్ష అమలుపై నిర్బయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా నా కుమార్తెకు న్యాయం జరిగిందని, దోషులకు ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుందన్ని అన్నారు. జాప్యం జరిగినా చివరకు న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇంతటితో తన పోరాటం ఆగదని, ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని నిర్భయ తల్లి ఆశాదేవి ఉద్ఘాటించారు. వ్యవస్థలో లోపాలతో దోషులు ఆడుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు.తమ కుమార్తె లేదని, ఇక తిరిగిరాదని తెలిసి, ఆమెకు జరిగిన అన్యాయం కోసం పోరాటం చేయాలని అప్పుడే నిశ్చయించుకున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వెంటనే నిర్భయ ఫోటోను గుండెలకు హత్తకుని నీకు న్యాయం జరిగిందని భోరున విలపించానని అన్నారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్థులను ఉరితీయడంతో దేశంలోని మహిళలు ఖచ్చితంగా సురక్షితంగా ఉంటారని, వారు కూడా ఇదే కోరుకున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఓ తల్లిచేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది.దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికి చేయని ప్రయత్నం లేదు. వాస్తవానికి జనవరి 22నే వారిని ఉరితీయాల్సి ఉండగా ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉండడంతో ఉరి వాయిదా వేశారు. తర్వాత కోర్టు ఫిబ్రవరి 1న వీరికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. కానీ ఆరోజు కూడా ఉరిశిక్ష విధించలేకపోయారు. దానిని తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేశారు. మూడోసారి మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలని పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే, మరో దోషి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉందని మూడోసారి ఉరిని వాయిదావేశారు. దీంతో మార్చి 5న చివరిసారిగా పాటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీచేసి, మార్చి 20న ఉరితీయాలని ఆదేశించింది.

Related Posts