YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ దేశీయం

రేపాసూర దహనం  

రేపాసూర దహనం  

రేపాసూర దహనం  
చిలుకూరు మార్చి 20 
నిర్భయ దోషుల ఉరిశిక్ష ఈరోజు అమలు చేయడంతో అసలైన దీపావళి ఈరోజే అని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్  అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం లోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ నిర్భయ దోషులకు  ఉరితీత అమలు చేయడంతో ఈరోజే దేశానికి అసలైన దీపావళి అని రేపాసుర దిష్టి బొమ్మను దహనం చేశారు.  అర్చకులు సౌందర్ రాజన్  మాట్లాడుతూ 2012 ఢిల్లీ లో నిర్భయపై కదిలే బస్సుల్లో అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు వినయ్ శర్మ పవన్ గుప్తా ముఖేష్ కుమార్  అక్షయ్ కుమార్ లను ఈరోజు తీహార్ జైలులో ఉరితీయడంతో ఆనందం వ్యక్తం చేస్తునే 8సంవత్సరాలు సాగదీయడంపై విస్మయం వ్యక్తం చేశారు ఇప్పటికయినా న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలని అన్నారు ఈరోజే దేశానికి అసలైన దీపావళి అని రేపాసుర దిష్టి బొమ్మను దహనం చేశారు.

Related Posts