YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

206కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

206కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు

206కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు
ముంబై, మార్చి 20
దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత మూడు రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 కేసులు 206కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు భారతీయులు కాగా, ఒక్కరు ఇటలీ పౌరుడు. ఇటలీ నుంచి వచ్చిన దంపతులు కరోనా వైరస్ నిర్ధారణ కాగా.. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందజేశారు. వీరిలో భర్త శుక్రవారం కార్డియాక్ అరెస్ట్‌తో మృతిచెందాడు. దేశంలో తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకోగా, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలోనూ ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. శుక్రవారం ఉదయం కొత్తగా 30 కేసులు నమోదయినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.మహారాష్ట్రలో శుక్రవారం కొత్తగా మరో మూడు కేసులు నమోదుకావడంతో ఆ రాష్ట్రంలో బాధితుల సంఖ్య 52కి చేరుకుంది. మహమ్మారిని నియంత్రించడానికి పటిష్ట చర్యలు తీసుకున్నా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో.. మహారాష్ట్ర సర్కారు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, పుణే, నాగపూర్ నగరాల్లో ఆఫీసులు, దుకాణాలను మూసివేయాలని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. మహా సర్కారు నిర్ణయంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, పుణే, నాగపూర్, పింప్రీ-చించ్‌వాడ్ ప్రాంతాలు లాక్ డౌన్ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.రాజస్థాన్‌లో కొత్తగా మరో మూడు కేసులు నిర్ధారణ కాగా, మొత్తం 12కి చేరింది. గుజరాత్‌లోనూ రెండు కేసులు నమోదు కాగా, కర్ణాటకలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. వడోదర, అహ్మదాబాద్‌కు చెందినవారు. తెలంగాణలో శుక్రవారం మరో రెండు కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 18కి చేరింది. ఈ బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నివస్తున్నవారు ఎవరూ కరోనా బారినపడలేదు. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని తెలిపారు. తాజాగా కరోనా వైరస్ బారినపడ్డ ఇద్దరు వ్యక్తులు కూడా విదేశాల నుంచే వచ్చినవారేనని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించగా.. కరోనా అనుమానిత లక్షణాలు ఉండగా వారిని నేరుగా గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Related Posts