YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఎ పాజిటివ్ గ్రూపుకు ప్రభావం

 ఎ పాజిటివ్ గ్రూపుకు ప్రభావం

 ఎ పాజిటివ్ గ్రూపుకు ప్రభావం
ముంబై, మార్చి 20
కరోనా వైరస్ వల్ల పరిస్థితులు ఎంత దయనీయంగా మారాయో తెలిసిందే. ప్రస్తుతం చైనాలో కోవిడ్-19 బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ దేశాల్లో ఆశలు చిగురించాయి. అలాంటి మంచి రోజులు తమకీ రావాలని ఆశిస్తున్నాయి. ముఖ్యంగా ఇటలీలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మృతుల సంఖ్యలో ఆ దేశం చైనాను కూడా మించిపోయింది. చైనాలో ఇప్పటివరకు 81 వేల మంది వైరస్‌కు గురయ్యారు. అయితే, కేవలం 7,263 మంది మాత్రమే తీవ్రమైన జ్వరంతో కరోనాకు చికిత్స పొందుతున్నారు. 3,245 మంది చికిత్స పొందుతూ మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,45,600 కరోనా కేసులు నమోదయ్యాయి. 84,500 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 10,000 మంది చనిపోయారు. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 3,405కు చేరింది. కొత్తగా మరో 5,322 మందికి వైరస్ నిర్ధారణ కాగా, బాధితుల సంఖ్య 41వేలు దాటింది. చైనాలో వ్యాధి సోకిన బాధితులు ఎక్కువగానే ఉన్నా.. అది తీసుకున్న జాగ్రత్తల వల్ల వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. అయితే, ఇటలీ తమ నిర్లక్ష్యంతో సమస్యను ప్రాణాలను మీదను తెచ్చుకుంది. వృద్ధులు, పిల్లలు, శ్వాస సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కరోనా నుంచి కోలుకోవడం కష్టమని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, చైనాలో చేసిన స్టడీలో బ్లడ్ గ్రూప్‌లపై కూడా ఈ వ్యాధి ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిసిందవైరస్‌ నివారణలో భాగంగా చైనా కరోనా బాధితుల శరీరంలో చోటుచేసుకున్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా ఉహాన్, షెంజహెన్ నగరాల్లో చికిత్స పొందుతున్న 2000 మంది కరోనా బాధితుల రక్త నమూనాలు సేకరించింది. వాటితోపాటు ఆయా నగరాల్లో వైరస్ సోకకుండా ఆరోగ్యం ఉన్న వ్యక్తుల రక్త నమూనాలను కూడా తీసుకుంది. ఈ సందర్భంగా ‘O’ గ్రూప్ వ్యక్తులు కరోనా వైరస్‌ను ఎదుర్కోగలుగుతున్నారని తెలుసుకున్నారు. ‘A’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. తమకు వచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది ‘A’ బ్లడ్ గ్రూప్ కలిగినవాళ్లే ఉన్నారని తెలిపారు. వీరికి ఇన్ఫెక్షన్ వేగంగా సోకడమే కాకుండా తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.‘A’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, కనీస జాగ్రత్తలు పాటిస్తే చాలని చైనా పరిశోధకులు తెలుపుతున్నారు. వీరు బహిరంగ ప్రాంతాల్లో తిరగకుండా ఇళ్లకే పరిమితం కావాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇతర గ్రూపులతో పోల్చితే ‘O’ గ్రూప్ రోగుల్లోనే ఉత్తమ ఫలితాలు కనిపించాయని తెలిపారు. ఝాంగాంగ్ హాస్పిటల్ ఆఫ్ ఉహాన్ యూనివర్శిటీకి చెందిన వైద్య నిపుణుడు వాంగ్ జింగుహాన్ ఈ వివరాలు తెలిపారని Medrxiv.org అనే ఆన్‌లైన్ వార్తా సంస్థ పేర్కొంది.పరిశోధకులు సేకరించిన 2000 మంది రోగుల జాబితాలో 206 మంది కరోనాకు చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో 85 మంది ‘A’ బ్లడ్ గ్రూప్ వ్యక్తులే ఉన్నారు. మిగతా మరణాలు వేర్వేరు బ్లడ్ గ్రూప్‌లు, వయస్సు, దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా సంభవించినట్లు పేర్కొన్నారు. ఈ స్టడీ ఆధారంగా ‘O’ బ్లడ్ గ్రూప్ వాళ్లు ఎలాగైనా ఉండవచ్చని చెప్పడం లేదని, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా ముప్పు తప్పదని తెలుపుతున్నారు. ‘A’ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్నారు. చైనా ఈ స్టడీని తమ రోగుల పరిస్థితి తెలుసుకొనేందుకు నిర్వహించింది. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో చేపట్టిన ఈ స్టడీని చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాల్లో ఏయే బ్లడ్ గ్రూప్ వ్యక్తులు ఉన్నారో తెలిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి బ్లడ్ గ్రూపైనా సరే కోవిడ్ సోకుతుంది. వారి ద్వారా కుటుంబ సభ్యులకు చేరుతుంది. కాబట్టి.. మీది ‘O’ బ్లడ్ గ్రూప్ అని అజాగ్రత్తగా ఉండకండి. అది మీ కుటుంబ సభ్యులకే ప్రమాదకరం కావచ్చు.
 

Related Posts