YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

సింగపూర్ లోనూ కంట్రోల్ లోనే కరోనా

సింగపూర్ లోనూ కంట్రోల్ లోనే కరోనా

సింగపూర్ లోనూ కంట్రోల్ లోనే కరోనా
న్యూఢిల్లీ, మార్చి 20 
మ దేశంలో ‘కరోనా’ అనే కొత్తరకం వైరస్ ఏర్పడిందని, దానికి మందులు కూడా అందుబాటులో లేవని చైనా ప్రకటించింది. దీంతో సింగపూర్ వెంటనే అప్రమత్తమైంది. జనవరి నెలలో ఆ దేశానికి వచ్చిన చైనా పర్యాటకుల జాబితాను సేకరించింది. వాళ్లు తిరిగిన ప్రాంతాలకు వైద్య బృందాలను పంపి.. వ్యాధి లక్షణాలతో ఉన్నవారిని నిర్బంధంలోకి తీసుకుని నేరుగా హాస్పిటల్‌కు తరలించింది. అయితే, అప్పటికి 18 మందిలోనే కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఆ చైనా మెడికల్ షాపులోనే ముందుగా వైరస్ పుట్టిందని తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించింది. ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అనుమానితులకు హాస్పిటల్‌లో చికిత్స అందించింది.ఆ మెడికల్ షాపులోని మహిళకు ముందుగా ఈ వైరస్ సోకింది. ఆ తర్వాత ఆమె భర్తకు, ఆరు నెలల బిడ్డకు, ఆ ఇంట్లో పనిచేసే ఇండోనేషియా పనిమనిషికి, షాపులోని ఇద్దరు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు.. ఇలా సుమారు 9 మంది వరకు వైరస్‌కు గురయ్యారు. వారి ద్వారా వైరస్ మరికొందరికి వ్యాపించింది. ప్రభుత్వం వారందరినీ ఐసోలేషన్ వార్డులో భర్తీ చేసి చికిత్స అందించింది. వారు ఎవరెవరిని తాకారు.. ఎక్కడెక్కడ తిరిగారు.. తదితర వివరాలన్నీ తెలుసుకుని బాధితుల కోసం అన్వేషించింది. అలా.. అలా.. దాదాపు ఈ వైరస్‌కు గురైన బాధితులందరినీ గుర్తించగలిగింది. ఫిబ్రవరి నెలలో 18 కేసులతో మొదలైన కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇప్పుడు 243కు పెరిగింది. అయితే, వీరిలో ఒక్కరు కూడా చనిపోలేదు. అలాగే కొత్త కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ కింది చర్యల వల్లే సింగపూర్ కరోనాను కంట్రోల్ చేయగలుగుతోంది.కరోనా వైరస్ బాధితులను పట్టుకోవడంలో సింగపూర్ చాలా వేగంగా.. చాకచక్యంగా వ్యవహరించిందనే చెప్పుకోవాలి. మాది అభివృద్ధి చెందిన దేశమని గొప్పలు చెప్పుకొనే అమెరికా కూడా ఇంత యాక్టీవ్‌గా లేదంటే నమ్మబుద్ధి కాదు. వైరస్ గురించి తెలియగానే సింగపూర్ ప్రభుత్వం టీవీలు, మొబైళ్లు, రేడియోల ద్వారా సమాచారం అందించింది. ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని.. లేకుంటే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకోవడం మొదలుపెట్టారు. మరోవైపు రోడ్డు, రైలు, నౌకా, విమాన మార్గాల్లో కూడా వైద్య సిబ్బందిని మోహరించింది. థర్మల్ టెస్టుల ద్వారా ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలపై నిఘా పెట్టింది. అనుమానితులను నిర్బంధించి మరీ హాస్పిటళ్లకు తరలించింది. రోడ్డు మీద వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి మరీ తనిఖీలు చేస్తున్నారు.
మన దేశంలో ముఖానికి పెట్టుకొనే మాస్కుల ధరలు ఏ స్థాయిలో పెరిగాయో తెలిసిందే. కొన్ని చోట్లయితే మాస్కులు దొరకని పరిస్థితి. అయితే, సింగపూర్‌లో మాత్రం ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైగా మాస్కులను ఇంటింటికీ ఉచితంగా పంపింది. ఫలితంగా అక్కడ కూడా మాస్కులకు భారీగా కొరత ఏర్పడింది. వేల సంఖ్యలో మాస్కులను తయారు చేసే బాధ్యతలను సైన్యానికి అప్పగించింది. అలాగే, అధిక ధరలకు మాస్కులను విక్రయిస్తే చర్యలు తప్పవని మెడికల్ దుకాణాలకు హెచ్చరించింది. దీంతో ప్రజలకు అందుబాటు ధరల్లోనే మాస్కులు లభించాయి.అన్ని దేశాల్లాగే సింగపూర్‌లో కూడా వైద్య సిబ్బందికి కొరత ఏర్పడింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలు అందించాలని కోరింది. అలా వచ్చినవాళ్లకు ప్రభుత్వం సేఫ్టీ కిట్లు అందించి సేవల్లో నియమించుకుంది. వీరిలో ఎక్కువ మందికి కరోనా బాధితులు తిరిగిన ప్రాంతాలు.. వారి సన్నిహితులను కనుగొనే బాధ్యతలను అప్పగించింది. చివరికి డిటెక్టీవ్‌లను కూడా రంగంలోకి దింపింది. ఈ బాధ్యతలన్నీ కాంట్రాక్ట్ కిందే అప్పగించాయి. అంటే.. వారి సేవలకు ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. ఫలితంగా సింగపూర్ వ్యాప్తంగా సుమారు 6 వేల మందిని ట్రేస్ చేసినట్లు తెలిసింది. వీరికి వైద్య పరీక్షలు చేసి వ్యాధి ఉందో లేదో నిర్ధరణ చేయాల్సి ఉంది. కరోనా బాధితులతో సంబంధం ఉన్న వ్యక్తులను కనుగొనేందుకు సుమారు 100 మంది డిటెక్టీవ్‌లు పనిచేస్తున్నట్లు సమాచారం.కరోనా వైరస్ లక్షణాలతో ఎవరైనా ఫోన్ చేస్తే.. ప్రభుత్వం ముగ్గురు వైద్యులతో కూడిన టీమ్‌ను అక్కడికి పంపుతోంది. వారి వెంటే పోలీసులు కూడా వెళ్తారు. బాధితుల వివరాలు సేకరించి.. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని ఆదేశిస్తారు. ఇందుకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అంగీకరిస్తూ సంతకం చేయాలని తెలిసింది. ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్లినట్లయితే భారీ జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు.. వారి కదలికలపై సీసీటీవీ కెమేరాలతో నిఘా పెట్టారు. అయితే, సింగపూర్ చిన్న దేశం కదా.. ఇదంతా చాలా సులభం అని భావిస్తే పొరపాటుపడినట్లే. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందిన దేశాల్లో సింగపూర్‌ ఒకటి.ఎవరికైనా వ్యాధి నిర్ధరణ జరిగితే.. వెంటనే వాళ్లు ప్రభుత్వ ఆధీనంలోకి రావల్సిందే. వారిలో వైరస్ పూర్తిగా తొలగిపోయేవరకు హాస్పిటల్‌లోనే ఉంచుతారు. అప్పటివరకు కుటుంబికులకు, స్నేహితులకు ప్రవేశం ఉండదు. అలాగే, అతడిని కలిసిన వ్యక్తులు, కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు చేస్తారు. వారిలో వైరస్ లేకున్నా.. గృహ నిర్బంధం చేస్తారు. రోజులో పలుసార్లు వారికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్‌లో వారు తాము ఉన్న ప్రాంతాన్ని ధృవీకరించాలి. వారు ఇంట్లో కాకుండా బయట ఉన్నట్లు తెలిస్తే.. భారీ జరిమానా లేదా జైలు శిక్ష తప్పదు.హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాలు ‘లాక్‌డౌన్’ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రజలు ‘వర్క్ ఫ్రం హోమ్’లు చేయడాలు. ఆ సదుపాయం లేనివాళ్లు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. బయట కాలు పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇండియాలో కూడా ముంబయి వంటి నగరాల్లో కర్ఫ్యూ విధించి కరోనా వైరస్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సింగపూర్ ఇందుకు సిద్ధంగా లేదు. అలా చేయడం వల్ల ప్రజలు నష్టపోతారని, ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుందని భావించి.. ‘లాక్‌డౌన్’ చేయడం లేదు. ప్రజలు నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూసుకుంటూ.. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉంటోంది.కరోనాను ఎదుర్కొన్న రెండో దేశమైన సింగపూర్‌లో ఈపాటికి వేల సంఖ్యలో కేసులు నమోదవుతాయని భావించారు. కానీ, అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు వల్ల బాధితులను వేగంగా గుర్తించి కరోనా వైరస్‌ను నియంత్రించడంలో సఫలం అవుతున్నారు. రెస్టారెంట్లు, మాల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లిఫ్టులు, ఎస్కలేటర్లను సైతం క్లీన్ చేస్తుండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రజలకు ఎప్పటికప్పుడు మెసేజులు పంపుతూ.. మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వంటి సూచనలు చేస్తోంది. అంతా ఒకే చోట గుమిగూడటం, మీటింగులను రద్దు చేసింది.కోవిడ్-19ను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలిసిందే. అయితే, దీనిపై చాలామందికి ఇంకా అవగాహన రావడం లేదు. అలాంటివారికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రభుత్వం పలు యూనివర్శిటీలతో కలిసి సరికొత్త ప్రచారానికి తెరతీసింది. షేక్ హ్యాండ్‌లకు ప్రత్యామ్నయంగా పలకరించుకొనే విధానాలను ప్రచారం చేస్తోంది. మరి మన ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందా? లేదా మిగతా దేశాలు తరహాలోనే ‘లాక్‌డౌన్’ ప్రకటిస్తారా? సింగపూర్ బాటలో ప్రయాణిస్తారా? వైరస్ వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆ దేశం మౌలిక సదుపాయాలను సమకూర్చుకోగలిగింది. వేగంగా స్పందించింది. మరి, మన దేశం ఆ స్థాయిలో సిద్ధమైందా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే, అన్నీ ప్రభుత్వమే చేయాల్సిన అవసరం లేదు. మన జాగ్రత్తల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తిని అదుపు చేయొచ్చు. కాబట్టి.. సురక్షితంగా ఉండండమే

Related Posts