YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

నా కూతురుని తల్లి నుంచి కాపాడండి

నా కూతురుని తల్లి నుంచి కాపాడండి

నా కూతురుని తల్లి నుంచి కాపాడండి
జైపూర్, మార్చి 21
ఇటీవల కాలంలో అమాయక అమ్మాయిలను కొందరు కేటుగాళ్లు మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడం, తర్వాత వారిని వ్యభిచార ముఠాలకు అమ్మేయడం లాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ తన కన్నకూతురినే వ్యభిచార ముఠాకు అమ్మేసి ‘అమ్మ’ అనే పిలుపుకే మాయని మచ్చ తెచ్చింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నీచురాలిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌కు చెందిన దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం మనస్పర్థల కారణంగా భార్యభర్తలిద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. బిడ్డలను తాను పెంచుతానని భర్త చెప్పినా వినకుండా తల్లి తన దగ్గరే పెట్టుకుంది. తండ్రి అప్పుడప్పుడూ వారిని చూసేందుకు వచ్చి వెళ్లేవాడు. అయితే కొంతకాలంగా కుమార్తె కనిపించకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. ఆమెను ఏం చేశావని భార్యను నిలదీయగా వేరే ప్రాంతంలో ఉంచి చదివిస్తున్నానని చెప్పింది. అయితే తాను ఫోన్లో మాట్లాడతానని నంబర్ ఇవ్వాలని అతడు కోరగా అక్కడ ఫోన్లు పనిచేయవని చెప్పింది.కూతురు గురించి ఎప్పుడు అడిగినా భార్య ఏదొక కహానీ చెబుతుండటంతో అతడికి అనుమానం వచ్చింది. దీంతో తన బంధువులు, స్నేహితుల సాయంతో లోతుగా విచారించగా షాకింగ్ విషయం తెలిసింది. డబ్బుల కోసం ఆమె కన్నకూతురిని వ్యభిచార ముఠాకు అమ్మేసినట్లు తెలిసింది. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన ఆ తండ్రి వెంటనే భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొరుగింటి వారి సాయంతో తన భార్య కూతురిని వ్యభిచార ముఠాకు అమ్మేసి ఆమె జీవితాన్ని నాశనం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నాడు.తాము మూడేళ్లుగా విడిగా ఉంటున్నామని, తన భార్య కూతురిని తానే పెంచుతానని పోట్లాడి మరీ తీసుకెళ్లిందని అతడు చెబుతున్నాడు. కన్నతల్లే బాలికను వ్యభిచార కూపంలోకి లాగేస్తుందని తాను ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తల్లి ప్రవర్తన నచ్చని కారణంగా ఏడాది క్రితం కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని ఆమె కూతురి జీవితాన్ని కూడా నాశనం చేసిందని వాపోయాడు. వ్యభిచారం కారణంగా తన కుమార్తె ఓ బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత ఆమెకు మరో ముఠాకు అమ్మేశారని తెలిసిందని ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నాడు. తన కూతురికి పుట్టిన బిడ్డకు తండ్రెవరూ కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నాడు. తన కూతురిని ఆ నరక కూపం నుంచి తప్పించి తనకు అప్పగించాలని పోలీసులను కోరుతున్నాడు.

Related Posts