పలు రైళ్లు రద్దు
సికింద్రాబాద్ మార్చి 21
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ళను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరిగే 250 ప్యాసింజర్ రైళ్ళను పూర్తిగా రద్దు చేసారు. శనివారం అర్థ రాత్రి నుంచి ఆదివారం రాత్రి పది గంటల వరకు పూర్తిగా రద్దు అయ్యాయి. జంట నగరాల్లో తిరిగే సబర్మన్ రైళ్ళు ను రద్దు చేసిన 121 ఎం.ఎం.టి. సర్వీసులలో..109 రద్దు చేసారు. ఆదివారం కేవలం 12 ఎం.ఎం.టి.యస్ సర్వీసులు మాత్రమే అందుబాటులో వుంటాయి. ఎక్స్ ప్రెస్ రైళ్లు 300 పైగా ఉంటే, ఆదివారం ఉదయం నుంచి 4గంటల నుంచి రేపు రాత్రి 10 వరకూ సుమారుగా 250 నిలిపివేస్తారు. రేపటి జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు సహకరించాలి. కొన్ని చోట్ల నుంచి కరోన అబ్జర్వేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన వారి చేతి మీద ఉన్న గుర్తులను చూసి కొన్ని చోట్ల స్టేషన్లలో మా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారని అధికారులు పేర్కోన్నారు.