ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచానికి దారి చూపాల్సింది ఇండియానేనని వ్యాఖ్యానించింది. కరోనాపై మీడియా సమావేశం నిర్వహించిన డబ్ల్యూహెచ్వో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్.. కరోనా వైరస్ లాంటి మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందని ఆయన అన్నారు. భారత్లో జనాభా ఎక్కువ అని, జనసాంద్రత కూడా ఎక్కువేనని.. అయినా మశూచి, పోలియో నివారణలో భారత్ విజయం సాధించిందని ర్యాన్ కొనియాడారు. కరోనా నుంచి బయటపడేందుకు ప్రస్తుతం ఉన్నదల్లా వ్యక్తిగత పరిశుభ్రతేనని.. సులభతరమైన ఉపాయాలు ఏవీ లేవని అన్నారు. అంతేకాదు.. ఇండియా లాంటి దేశాలే ఓ మార్గాన్ని చూపాల్సిన తరుణం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇలాంటి మహా విపత్కర పరిస్థితుల నుంచి భారత్ బయటపడిందని చెప్పారు. మశూచి, పోలియో సోకిన సమయంలో భారత్ చూపించిన తెగువను గుర్తు చేసిన ఆయన.. కరోనాను జయిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. కాగా, లాక్డౌన్, కర్ఫ్యూ వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకోలేమని.. మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందని ఆయన స్పష్టం చేశారు.