YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఎట్టకేలకు షమికి చోటు 

Highlights

  • దిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో మహమ్మద్‌ షమి చేరిక 
  • ఈ నెల 7న ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభం 
  • 8న మొహాలి వేదికగా మ్యాచ్‌
ఎట్టకేలకు షమికి చోటు 

టీమిండియా పేసర్‌ మహమ్మద్‌ షమి దిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టులో చేరాడు. సహచర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.ఇటీవల షమి ప్రాక్టీసులో పాల్గొని వస్తుండగా అతని కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన షమి పూర్తిగా కోలుకుని సోమవారం దిల్లీ డేర్‌డెవిల్స్‌జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ నెల 7న ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నీలో భాగంగా దిల్లీ తన తొలి మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ను ఢీకొట్టనుంది. మొహాలి వేదికగా ఏప్రిల్‌ 8న ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనే జట్లు స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో సోమవారం నుంచి పూర్తి స్థాయి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాయి. జట్టులోని ఆటగాళ్లే రెండుగా విడిపోయి సన్నాహక మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. కాగా మహిళలతో సంబంధాలు ఉన్నాయని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ షమిపై అతని భార్య హసీన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కూడా చేపట్టారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపరణలపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధికారులు కూడా దర్యాప్తు చేపట్టగా అందులో ఎలాంటి నిజంలేదని తేలింది. దీంతో బీసీసీఐ షమికి కాంట్రాక్టు ఇవ్వడంతో పాటు ఐపీఎల్‌లో ఆడేందుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Related Posts