YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

పీఎంవోని వైసీపీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోంది

Highlights

  • వైసీపీని బీజేపీ చేరదీస్తోంది
  • ఇక బీజేపీతో రామ్ రామ్  
  • జాతీయ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు
పీఎంవోని వైసీపీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోంది

అవినీతి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని  బీజేపీ చేరదీస్తోందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. మంగళావారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్రబాబు  పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రధాని కార్యాలయాన్ని వైసీపీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని అన్నారు. ఇక బీజేపీతో తమకు ఎలాంటి సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా తాము ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పారు.
జాతీయ రాజ‌కీయాలపై మాట్లాడేందుకు విముఖ‌త చూపిన చంద్రబాబు  ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19 పెండింగ్ అంశాల జాబితాను వివరించారు. పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారని చంద్రబాబు చెప్పారు. 

Related Posts