YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

నిత్యావసర సరుకుల రవాణా వాహనాలపై డిస్‌ప్లేలు ఏర్పాటు చేయాలి: డీజీపీ

నిత్యావసర సరుకుల రవాణా వాహనాలపై డిస్‌ప్లేలు ఏర్పాటు చేయాలి: డీజీపీ

నిత్యావసర సరుకుల రవాణా వాహనాలపై డిస్‌ప్లేలు ఏర్పాటు చేయాలి: డీజీపీ
హైదరాబాద్‌ మార్చ్ 26
నిత్యావసర సరుకులను తరలించే వాహనాలపై సంబంధిత సరుకులను తెలియజేసే విధంగా డిస్‌ప్లేలను పెద్దగా అంటించాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి సప్లై చైన్ మేనేజర్లకు సూచించారు.. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... సులభతర గుర్తింపునకు గాను వాహనాల ఫ్రంట్‌ విండో ఎడమభాగంపై డిస్‌ప్లేలను పెద్దగా అంటించాలన్నారు. సంబంధిత వాహనం ఏ సరుకులను తరలిస్తుందో తెలియజేసే విధంగా డిస్‌ప్లే ఉండాలన్నారు. విధుల్లో ఉన్న పోలీసులు అధికారులు ఇటువంటి వాహనాలను అనుమతించాల్సిందిగా తెలిపారు. సరుకుల లోడింగ్‌కు, అన్‌లోడింగ్‌కు అనుమతి ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు.

Related Posts