YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

పరుగెడుతున్న బంగారం ధరలు

పరుగెడుతున్న బంగారం ధరలు

పరుగెడుతున్న బంగారం ధరలు
ముంబై, మార్చి 27
బంగారం ధర పరిగెడుతూనే ఉంది. పసిడి ఈ రోజు కూడా ర్యాలీ చేసింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా మన దేశంలో మాత్రం బంగారం ధర పైకి కదలడం గమనార్హం. బంగారం ధర పెరగడం ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం. ఇకపోతే వెండి ధర మాత్రం తగ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.180 పెరుగుదలతో రూ.44,810కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరుగుదలతో రూ.41,260కు ఎగసింది.పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.310 తగ్గింది. దీంతో వెండి ధర రూ.41,500కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 1640 డాలర్ల సమీపంలోకి చేరింది. పసిడి ధర ఔన్స్‌కు 0.75 శాతం తగ్గుదలతో 1639.640 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.20 శాతం తగ్గుదలతో 14.68 డాలర్లకు దిగొచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం ధర రూ.180 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరుగుదలతో రూ.42,050కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.180 పెరుగుదలతో రూ.43,250కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.310 తగ్గుదలతో రూ.41,500కు క్షీణించింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

Related Posts