YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు..ఇంట్లోనే చేసుకొండి: వక్ఫ్ బోర్డ్

మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు..ఇంట్లోనే చేసుకొండి: వక్ఫ్ బోర్డ్

మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు..ఇంట్లోనే చేసుకొండి: వక్ఫ్ బోర్డ్
అమరావతి మార్చ్ 27
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్,మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని, మిగిలిన వారు మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా కోరారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ కూడా ఈ మేరకు ఫత్వా జారీ చేసిందని ఆయన తెలిపారు.దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెప్తున్నాయని ఆయన అన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్ధనలు ఇంట్లో చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసిందని ఆయన వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ నేపథ్యంలో ముస్లిం సోదరులంతా సహకరించాలని కోరుతున్నామని ఆయన అన్నారు.

Related Posts