తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి అపరభక్తురాలు, భక్తకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతిని ఏప్రిల్ 28వ తేదీన తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి సమర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి పరిణయమండపానికి వేంచేపు చేస్తారు. రాత్రి 8 గంటల వరకు అక్కడ వెంగమాంబ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు తరిగొండ వెంగమాంబ సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహిస్తారు.