YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

 13.3 కోట్ల మంది వీక్షించిన మోడీ స్పీచ్

 13.3 కోట్ల మంది వీక్షించిన మోడీ స్పీచ్

 13.3 కోట్ల మంది వీక్షించిన మోడీ స్పీచ్
న్యూఢిల్లీ, మార్చి 28
ప్రధాని మోదీ చేసిన లాక్‌డౌన్‌ ప్రకటన నయా రికార్డులు సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ సాధించిన టెలివిజన్‌ ప్రసంగంగా రికార్డుకెక్కింది. 2016 నోట్ల రద్దు స్పీచ్‌ను ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్‌ ఏజెన్సీ బార్క్‌ ఇండియా వెల్లడించింది. గతంలో ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలకు అత్యధిక వ్యూయర్‌షిప్ ఉండగా.. తాజాగా లాక్‌డౌన్ ప్రసంగానికి రెండింతల వ్యూయర్‌షిప్ దక్కింది. ఇప్పటివరకు ఐపీఎల్‌ ఫైనల్‌కు అత్యధిక వ్యూయర్‌షిప్ (13.3 కోట్ల మంది వీక్షించారు) ఉండగా.. మోదీ లాక్‌డౌన్ ప్రసంగం దాన్ని అధిగమించింది.కరోనా వైరస్‌పై పోరులో భాగంగా తొలుత మార్చి 19న జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ‘జనతా కర్ఫ్యూ’కు పిలపునిచ్చారు. అనంతరం 24న రెండోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని అత్యధికంగా 19.7 కోట్ల మంది వీక్షించారని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్‌ ఇండియా) వెల్లడించింది. దీన్ని 201 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్‌ ట్వీట్‌ చేశారు.జనతా కర్ఫ్యూను ఉద్దేశిస్తూ మార్చి 19న మోదీ చేసిన ప్రసంగానికి 8.30 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. 191 ఛానళ్లు దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఇక గతేడాది ఆర్టికల్‌ 370 రద్దు ప్రసంగాన్ని 163 ఛానళ్లు ప్రసారం చేయగా.. 6.5 కోట్ల మంది వీక్షించారు. 2016 నవంబర్ 8న మోదీ నోట్ల రద్దు ప్రసంగాన్ని 114 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయగా.. 5.7 కోట్ల మంది వీక్షించారు.

Related Posts