YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

దళితులపై దాడులకు కాంగ్రెస్, బీజేపీ పాలనే కారణం : మంత్రి హరీష్‌రావు

దళితులపై దాడులకు కాంగ్రెస్, బీజేపీ పాలనే కారణం : మంత్రి హరీష్‌రావు

భారత్ బంద్ సందర్భంగా దళితులపై దాడులు జరుగటం బాధాకరమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు.  స్వాతంత్య్రం వచ్చి ఇన్నేైళ్లెనా ఇలాంటి పరిస్థితులు రావడానికి కాంగ్రెస్, బీజేపీ పాలనే కారణమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల దాడుల్లో 9 మంది దళితులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అన్నారు.ఎస్సీ,ఎస్టీ చట్టాలు ఉన్నప్పటికీ వారిపై దాడులు ఆగడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు లేకపోతే తమకు న్యాయం జరగదని దళితులు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆయా వర్గాల్లో ఉన్న బాధను లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ విషయంపై ప్రధాని చొరవ చూపి మాట్లాడాలని మంత్రి కోరారు.దేశంలో ప్రతి ఏటా 40 వేలకు పైగా దళితులపై కేసులు నమోదు అవుతున్నాయని వెల్లడించారు. 2010లో 40,481, 2011లో 40,435,2012లో 41,826,2013లో 45,631 కేసులు నమోదైనట్లు మంత్రి చెప్పారు. రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో కేసులు నమోదు అవుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని.. ఒక్క రాజస్థాన్‌లోనే 34.7 శాతం కేసులు దళితులపై నమోదు అయ్యాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో పేదవాళ్లు మరింత పేదలు.. ధనికులు మరింత ధనవంతులయ్యారని పేర్కొన్నారు.

Related Posts