YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేరళలో తొలి కరోనా మరణం..దేశంలో 20కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో తొలి కరోనా మరణం..దేశంలో 20కి చేరిన మృతుల సంఖ్య

కేరళలో తొలి కరోనా మరణం..
         దేశంలో 20కి చేరిన మృతుల సంఖ్య
తిరువనంతపురం మార్చ్ 28
కేరళలో తొలి కరోనా మరణం నమోదైంది. కొచ్చి మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 69 ఏళ్ల వృద్ధుడు ఇవాళ  ఉదయం మృతి చెందాడు. కరోనా వైరస్‌ కారణంగానే వృద్ధుడు మృతి చెందినట్లు ఎర్నాకులం జిల్లా మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎన్‌కే కుట్టప్పన్‌ మీడియాకు వెల్లడించారు. కేరళలో వృద్ధుడి మరణంతో భారతదేశంతో కరోనా మృతుల సంఖ్య 20కి చేరింది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 873కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 149 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాధికి మెడిసిన్‌ కనుగొనేందుకు కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కరోనా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది డబ్ల్యూహెచ్‌వో.కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 176 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో 162, కర్ణాటకలో 64, తెలంగాణలో 59, గుజరాత్‌లో 54, రాజస్థాన్‌లో 50, యూపీలో 50, ఢిల్లీలో 40, తమిళనాడులో 40, పంజాబ్‌లో 38, హర్యానాలో 33, మధ్యప్రదేశ్‌లో 33, జమ్మూకశ్మీర్‌లో 20, బెంగాల్‌లో 15, ఏపీలో 13, లడఖ్‌లో 13, బీహార్‌లో 9, ఛండీఘర్‌లో 8, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 6, ఛత్తీస్‌గఢ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, గోవాలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, ఒడిశాలో 3, మణిపూర్‌, మిజోరాం, పుదుచ్చేరిలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి.

Related Posts