YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ

అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ

అధిక ధరలకు అమ్మితే కేసు గ్యారెంటీ
వ‌రంగ‌ల్ మార్చి 30 
సామాజిక‌ దూరాన్ని పాటించాల‌ని, సానిటైజర్ల‌ను వాడాల‌ని, ముఖాల‌కు ద‌స్తీలు క‌ట్టుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కోరారు. నేడు ఆయన వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర‌కాల‌లో కూర‌గాయ‌ల మార్కెట్ ని సంద‌ర్శించారు.కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌ర స‌రుకులు అందుబాటులో ఉన్నాయా? అని ప్రజలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూర‌గాయలు అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న ఇద్ద‌రిపై ఫైన్ వేయాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు. ఇక ముందు ఫైన్  కాదు కేసులు కూడా పెట్టాలని కూర‌గాయ‌ల మార్కెట్ లో ధ‌ర‌ల ప‌ట్టిక‌లు ఉంచాల‌ని, ధ‌ర‌ల నియంత్ర‌ణ జ‌ర‌గాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంత్రి దయాకర్ రావు తో పాటు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కూడా ఉన్నారు.
 

Related Posts