తెలుగు యాత్రీకులను ఆదుకోవాలి
నారా లోకేశ్
హైదరాబాద్ మార్చ్ 30
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వారణాసిలో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. తీర్థయాత్రలకు వెళ్లిన 34 మంది వారణాసిలో చిక్కుకున్నారని లోకేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. యాత్రీకులకు సహాయం అందించాలని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను కోరారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న తెలుగువారి వివరాలు, ఫోన్ నంబర్లను ట్విటర్లో పోస్టు చేశారు. వారంతా వారణాసిలోని నటరాజన్ హోటల్ లో సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.