YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఇంట్లో దాక్కున్న చంద్రబాబు

 ఇంట్లో దాక్కున్న చంద్రబాబు

 ఇంట్లో దాక్కున్న చంద్రబాబు
తాడేపల్లి మార్చి31
కరోనా వైరస్ కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారు. చంద్రబాబు లాగా  వైయస్ జగన్మోహన్ రెడ్డి దాక్కోలేదు. వయస్సు పై బడి చస్తాననే భయంతో చంద్రబాబు ఆక్సిజన్ పెట్టుకొని బతుకు తున్నాడు. విపత్కర పరిస్దితులలో రాజకీయాలు చేయడం మానుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అన్నారు.  మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. మన రాష్ట్రంలో ఎల్లో వైరస్ ఉంది.కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది ఎల్లో వైరస్. ఎల్లో వైరస్ కోరలు పీకే మందు మాదగ్గర ఉంది. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఉంది. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన చర్యలు తీసుకున్నారు. చంద్రబాబులా ప్రచార పిచ్చి  వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదు. తప్పుడు ప్రచారం చేస్తే చంద్రబాబు బట్టలు ఊడదీయాల్సి వస్తుంది. అందరికి రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. రేషన్ షాపుల వద్ద జనం గుంపులు గుంపులుగా ఉండకూడదు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచితంగా సరుకులు సరఫరా చేస్తున్నాము. వేలిముద్ర లేకుండా నిత్యావసర వస్తువులు ఇస్తున్నామని అన్నారు. -గంటకు 20 నుంచి 25 మందికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నాం. ప్రతి ఒక్క వినియోగదారునికి సరుకులు అందిస్తాం. వాలంటరీ వ్యవస్థ ద్వారా సరుకులు ఇవ్వాలని కొందరు అడుగుతున్నారని అన్నారు. గతంలో వాళ్ళే వాలంటరీ వ్యవస్థ ను హేళన చేసిన నిష్టదరిద్రులు. వాలంటీర్లు  అమ్మాయిలను ఏడిపిస్తారని విమర్శలు చేసారు. కరోనా నియంత్రణపై వాలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారు. వాలంటీర్లు ఒకరి ఇంటికి తరువాత మరొక ఇంటికి వెళ్లి ఇస్తే కరోనా వలన ఇబ్బంది అవుతుందని ఇవ్వలేదు. అయినా వాలంటీర్లు ఖాళీగా లేరు.నిత్యం ప్రజల ఆరోగ్యాల గురించి పనిచేస్తున్నారు.  విదేశాలనుంచి వచ్చింది ఎవరు అని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వాలంటీర్లు వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థను అభినందిస్తున్నాను. చోడవరంలో మహిళ రేషన్ కు వెళ్లి చనిపోయిందని పనికిమాలిన ఛానెల్స్ కొన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు ఊర కుక్కలు మహిళ రేషన్ కోసం వచ్చి చనిపోయిందని మొరుగుతున్నాయి. తప్పుడు వార్తలు రాయడానికి ఇది సమయం కాదు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఛానెల్స్ పై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని అదేశించాం. పనికిమాలిన దేవినేని ఉమా, సోదిరెడ్డి సోమిరెడ్డి ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వదిన ను చంపిన దేవినేని ఉమానా... నన్ను రాజీనామా చేయమని అడిగేదని మండిపడ్డారు. ఈ నెల రేషన్ తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చే విషయం సీఎం గారితో చర్చిస్తానని మంత్రి అన్నారు.
 

Related Posts