లాక్డౌన్ పై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు
న్యూఢిల్లీ మార్చ్ 31
దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్పై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంగళవారం తాజాగా మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలని సూచించింది. వలస కార్మికులను వెంటనే ఆశ్రయం కల్పించాలంది. ఒకనెల అద్దె వసూలు చేయొద్దని ఇంటి యజమానులకు సూచించాలని ఆదేశించింది. అద్దెదారుల పట్ల సానుకూలంగా ఉండేలా ఇంటి యజమానులకు సూచించాలని, వలస కార్మికులు ఎక్కడికీ కదలకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.