YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

1125 కోట్ల విప్రో విరాళం

1125 కోట్ల విప్రో విరాళం

1125 కోట్ల విప్రో విరాళం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1
కరోనా వైరస్ కారణంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ.. సాయం చేయడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే టాటా ట్రస్టులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ వంతు విరాళాలు ప్రకటించగా.. తాజాగా విప్రో కూడా భారీ విరాళం ప్రకటించింది.. విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ కలిసి.. రూ.1125 కోట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాయి. మానవాళిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కరోనాపై పోరాటం కోసం మందులు, ఇతర సేవల కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారురూ.1125 కోట్లలో.. విప్రో లిమిటెడ్ రూ.100 కోట్లు ఇవ్వనుండగా.. విప్రో ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ.25 కోట్లు విరాళంగా అందించనుంది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1000 కోట్లు సాయం చేయనుంది. విప్రో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద ఏటా కేటాయించే మొత్తానికి, అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ చేసే దాతృత్వానికి ఇవి అదనం.విప్రో సంస్థ వ్యవస్థాపకుడైన అజీమ్ ప్రేమ్ జీ.. సామాజిక సేవకు, దాతృత్వానికి పెట్టింది పేరు. విప్రోలో తన వాటాల్లో 34 శాతం లేదా రూ.52,750 కోట్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు ఇస్తానని గత ఏడాది మార్చిలో ప్రేమ్‌జీ ప్రకటించారు.

Related Posts