YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి అంతర్జాతీయ హోదా..!

Highlights

  • విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్లు స్టేషన్ల మహర్దశ
  • ఒక్కో స్టేషన్ కు 25 కోట్లు విడుదల 
ఏపీకి అంతర్జాతీయ హోదా..!

దక్షిణ మధ్య  రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న  నాలుగు రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ హోదాను రైల్వే శాఖ కట్టబెట్టనుంది. దీంతో ఏపీలోని ఆ నాలుగు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఈనెల 10వ తేదీ లోపు పంపాలని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనితో  విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్లు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టనున్నది. అంతర్జాతీయ హోదాకు ఎంపిక చేసిన ఒక్కో రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు 25 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ రైల్వే మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Related Posts