YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పసిడి పరుగులు

పసిడి పరుగులు

పసిడి పరుగులు
ముంబై, ఏప్రిల్ 3 
పసిడి పరుగులు పెట్టింది. గత కొన్ని రోజులుగా వెలవెలబోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. దీంతో బంగారం ధర నాలుగు రోజుల తగ్గుదలకు నేటితో బ్రేకులు పడ్డాయి. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినా కూడా మన దేశంలో పసిడి ధర పెరగడం గమనార్హం.హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.39,440 నుంచి రూ.39,730కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.190 పెరుగుదలతో రూ.43,080 నుంచి రూ.43,270కు ఎగసింది.పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.220 పెరిగింది. దీంతో వెండి ధర రూ.40,160కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చుఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.34 శాతం క్షీణతతో 1629.65 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.63 శాతం క్షీణతతో 14.56 డాలర్లకు పడిపోయింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.240 పెరుగుదలతో రూ.41,180కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.260 పెరుగుదలతో రూ.43,470కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.220 పెరుగుదలతో రూ.40,160కు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి

Related Posts