24 గంటల్లో కొత్తగా 601మందికి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ ఏప్రిల్ 4
భారత్ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. దేశవ్యాప్తంగా 3,188 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ మాట్లాడుతూ..'భారత్లో 24 గంటల్లోనే కొత్తగా 601మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడి మరో 12 మంది మృతి చెందడంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 68కు చేరింది. శనివారం వరకు మొత్తం 183 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 2,902 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని' లవ్ అగర్వాల్ వివరించారు.